ఉన్నత విద్యను అభ్యసించడానికి పదవ తరగతి నుంచి పునాదులు వేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహిస్తుంటారు.
నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎ్సఈ) లెవల్ 1 పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈనెల 27 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్రెడ్డి తెలిపారు.
నవంబర్ ఐదో తేదీన జరిగే ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.