కాల్షియం లోపం రాకుండా ఖచ్చితంగా ఇవి తినాలి?

మన శరీరంలో కాల్షియం లోపం ఏర్పడితే ఎముకలు, కండరాలు ఖచ్చితంగా పటిష్టతను కోల్పోతాయి.ఎందుకంటే ఎముకలు, కండరాల పటిష్టతను కాపాడడంలో ఉపయోగకరంగా ఉండేది ఇవే. ఇంకా ఈ కాల్షియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే శరీరంలోని పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ కాకపోతే కడుపు మంట ఇంకా గ్యాస్ట్రిక్ వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీరంలో తగినంత కాల్షియం ఉంటే మీ దంతాలు కూడా ఖచ్చితంగా బలోపేతమవుతాయి. అలాగే కండరాల నొప్పులు కూడా చాలా ఈజీగా నయమవుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే కాల్షియం మనం శరీరంలో ఖచ్చితంగా ఉండాలి.వాల్‌నట్స్, అత్తి పండ్లు, ఖర్జూరాలు, ఆప్రికాట్లలో కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు ఇంకా అలాగే విటమిన్లు ఉంటాయి. స్నాక్స్ రూపంలో వీటిని తరచుగా తినడం వల్ల ఎముకలు, దంతాలు చాలా పటిష్టంగా ఉంటాయి.


అలాగే మెంతి, బ్రొకలీ, పాలకూర, బచ్చలికూర, ముల్లంగి వంటి వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీరలో కూడా ఈ కాల్షియం ఉంటుంది. పుదీనా, కొత్తిమీర చట్నీ తరచుగా చేస్తుంటే శాండ్‌విచ్ లేదా అన్నంతో వాటిని కలిపి తినండి.ఇంకా అలాగే రాజ్మా, కాబూలీ శనగలు, శనగలు, అలసందల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.అయితే వీటిని టమాటా, ఉల్లితో కలిపి వండి అన్నంలో గానీ, చపాతీలో గానీ తినండి.ఇంకా అలాగే పెరుగుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఇంట్లో ఎప్పుడూ పెరగు అందుబాటులో ఉంచుకుంటే పిల్లలకు కావలసిన కాల్షియం ఎక్కువగా లభిస్తుంది.ఇక మీ పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా పెరుగన్నం తప్పనిసరిగా తినేలా చూసుకోవాలి.నల్ల నువ్వుల్లో కాల్షియం, విటమిన్ బీ కాంప్లెక్స్ ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. నువ్వుల లడ్డూలు  పిల్లలకు ఎక్కువగా చేసివ్వడం వల్ల కాల్షియం ఖచ్చితంగా వారికి తగినంతగా అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: