కొంతమందిలో కంటి చూపు పక్క భాగాలలో స్పష్టంగా కనిపించినప్పటికి మధ్య భాగంలో మాత్రం నల్లగా, మసకగా కనిపిస్తుంది. దీన్నే మాక్యులర్ డిజెనరేషన్ అంటారు.కనుగుడ్డు వెనక భాగంలో ఉండేదే మాక్యులా.ఇలా మధ్య భాగంలో నల్లగా ఇంకా మసకగా కనబడడానికి కారణం మాక్యులాకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడమే.ఈ మాక్యులాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల ఇంకా రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది.అందువల్ల చక్కగా ఉండే గీతలు కూడా వంకరగా కనిపిస్తాయి. దీని వల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా అంతగా కనిపించదు. ఇంకా అలాగే ముఖాలను కూడా గుర్తించకలేకపోతూ ఉంటారు.అలాగే రంగులను కూడా కనిపెట్టలేకపోతూ ఉంటారు.అక్షరాలు కూడా బాగా మసకగా కనిపిస్తాయి. మాక్యులర్ డీజెనరేషన్ సమస్య తలెత్తడానికి చాలా కారణాలు ఉంటాయి.డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇంకా అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.


అలాగే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ వచ్చి మాక్యులాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనేవి దెబ్బతింటాయి. దీంతో మాక్యులర్ డి జెనరేషన్ అనే ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకా అలాగే అధిక బరువు కూడా ఈ సమస్యకు మరొక కారణం.కొంత మందిలో జన్యుపరమైన సమస్యల కారణంగా అలాగే ధూమపానం కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. ఈ మాక్యులర్ డీజెనరేషన్ అనే ఈ సమస్యను మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.ఎక్కువగా రా ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఈ సమస్య ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. అలాగే రోజుకు 400 నుండి 500 మిల్లీ గ్రాముల విటమిన్ సి తీసుకోవాలి. ప్రతి రోజూ రెండు జామకాయలు, భోజనం చేసిన తరువాత పెద్ద ఉసిరికాయను ఎండబెట్టిన ముక్కలను తీసుకోవాలి.మనం విటమిన్ సి ని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఇంకా అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: