శొంఠి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్పెక్షన్ లను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, వాతాన్ని తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా ఈ శొంఠి మనకు సహాయపడుతుంది.మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ శొంఠితో మనం కారం పొడిని కూడా తయారు చేసుకోని తింటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.6 నెలల పిల్లల నుండి ముసలి వారి వరకు ఎవరైనా కూడా ఈ కారం పొడిని తీసుకోవచ్చు.తరుచూ వాతం చేసే వారు ఈ కారం పొడిని తినడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ శొంఠి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


శొంఠి కారం పొడి ఎలా తయారు చేసుకోవాలంటే..ముందుగా మనం కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ నెయ్యి వేడయ్యాక శొంఠి వేసి కాసేపు వేయించాలి. దీనిని ఎర్రగా అయ్యే దాకా వేయించిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత వేయించిన శొంఠిని రోట్లో వేసి ముక్కలుగా దంచుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత వేయించిన మిగిలిన పదార్థాలు ఇంకా అలాగే ఉప్పు వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన శొంఠికారం తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వచేసుకోవడం వల్ల 6 నుండి 8 నెలల పాటు ఈజీగా నిల్వ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, చిటికెడు శొంఠి పొడి వేసి కలిపి ఒక ముద్ద తీసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తయారు చేసుకొని తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. దీన్ని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరవు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తినండి.


మరింత సమాచారం తెలుసుకోండి: