
నిమ్మరసంలో ఎక్కువగా ఉండేది సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ కిడ్నీల ఆరోగ్యానికి చాలా ముఖ్యం
ఇది తరచుగా మూత్ర విసర్జన జరిగేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, నిమ్మరసం శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలకు నష్టం జరుగుతుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులకు నిమ్మరసం ఒక వరం లాంటిది. ఇది కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రాకుండా నివారిస్తుంది.
అయితే, ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మోతాదులో తీసుకుంటే, నిమ్మరసం కిడ్నీలకు ఎటువంటి హాని చేయదు. రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది కేవలం కిడ్నీలకే కాకుండా, మొత్తం శరీరానికి కూడా మంచిది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు