ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయనతో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ దర్శకులు సైతం పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు తెగ ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటించాలని గత నెల రోజుల్లో పలు కంపెనీలు ప్రభాస్కి వంద కోట్లు ఆఫర్ చేశాయట.
కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈయన నటించిన `రాధేశ్యామ్` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రభాస్ మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నారు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. మిగిలిన రెండు సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇవి పూర్తైన వెంటనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేయనున్నాడు.