ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో, అంతకు మించిన సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే,  అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్  'రాధే శ్యామ్'  సినిమాలో నటిస్తున్నాడు,  ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనివార్య కారణాల వల్ల ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది,  ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో అప్పట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా చిత్ర బృంద భారీగా నిర్వహించింది,  కాకపోతే ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మార్చి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు  కొన్ని రోజుల క్రితం ఒక చిత్ర బృందం తెలియజేసింది,  ఇదిలా ఉంటె ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మరోసారి ఫ్రీ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. రాదే శ్యామ్  ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల మొదటి వారంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను బారి ఎత్తున నిర్వహించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు,  తాజాగా ఈ మూవీ లోని ఈ రాతలే .. ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు,  పూర్తి సాంగ్ ని రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ,  జగపతిబాబు,  సత్యరాజ్ కీలకమైన పాత్రలను పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: