దర్శక ధీరుడు రాజమౌళి.. ఈయన గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన అద్భుతమైన సినిమాలే ఈయనను ప్రేక్షకులందరికీ పరిచయం చేస్తూ ఉంటాయి. అంతే కాదు ప్రేక్షకులందరూ ఈయన గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని భారతదేశవ్యాప్తంగా మాత్రమే కాదు ఎల్లలు దాటించిన  గొప్ప దర్శకుడిగా రాజమౌళికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమని ప్రేక్షకులందరూ నమ్ముతుంటారు.


 ఇక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిందంటే చాలు ఊహించని రీతిలో అంచనాలను పెంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే రాజమౌళి సినిమాలను తెరకెక్కించడం విషయంలో ఎంత పక్కాగా ఉంటారో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా అంతే పక్కాగా  ఉంటారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమ విడుదలకు ముందు ప్రమోషన్స్ లో ఊపిరి సలపనంత బిజీగా మారారు రాజమౌళి. అయితే ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసాము కానీ బుల్లితెర  కార్యక్రమాలకు ఇప్పటివరకు రాజమౌళి వచ్చింది లేదు అని చెప్పాలి.


  తన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలకు బుల్లితెర షో లకు ప్రమోషన్స్ కోసం రాని రాజమౌళి ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్ లో బాగా ఎక్కువగా  పాల్గొంటున్నాడు. అంతేకాదు ఇటీవలే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో మొదటి సారి బుల్లితెరపై కనిపించాడు. అయితే రాజమౌళి రావడాన్ని సుమ కూడా నమ్మలేక పోయింది. ఒకసారి నన్ను గిళ్ళండి  అంటూ మళ్లీ ఒకసారి అది నిజమేనా కాదా అన్నది చెక్ చేసుకుంది. రాజమౌళి అభిమానులు సైతం నిజంగా ఇదే విషయం పై షాక్ అవుతున్నారు. తన సినిమాలకు బుల్లితెర కార్యక్రమాల్లో ప్రమోషన్స్ చేయని జక్కన్న బ్రహ్మాస్త్ర కోసం ఎందుకు ఇలా చేశాడబ్బా అనే ఆలోచనలో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: