రాజమౌళి దర్శకత్వంలో మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అన్న విషయాన్ని ఇప్పటికే వెల్లడించాడు. ఈ నేపథ్యంలో వెంటనే ఈ సినిమాను చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టడం నిజంగా మహేష్ అభిమానులను కొంతమందిని నిరాశపరిచింది అనే చెప్పాలి.

త్రివిక్రమ్ మంచి దర్శకుడు అయినప్పటికీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాజమౌళి సినిమాను మహేష్ బాబు చేసి త్వరగా విడుదల చేస్తే బాగుండేది అని కోరుకుంటున్నారు. ఆ విధంగా మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి రాజమౌళి చిత్రాన్ని వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నాడు. మొన్నటిదాకా ఈ సినిమాను సంక్రాంతికి మొదలు పెడతారని ప్రతి ఒక్కరు కూడా భావించారు. త్రివిక్రమ్ సినిమాను డిసెంబర్లో పూర్తిచేసి సంక్రాంతి తరువాత రాజమౌళి సినిమా మొదలు పెట్టాలని ప్రణాళికలు రూపొందించారు.

కానీ మహేష్ బాబు హాలిడేకి వెళ్లడం సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో మరికొన్ని రోజులు రాజమౌళి సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేసవిలోనే ఆ సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తుంది. మరి ఒక సినిమా చేయడానికి ఎక్కువ సమయం తీసుకుని రాజమౌళి ఈ సినిమాను తక్కువ సమయంలోనే చేస్తానని చెబుతూ ఉన్నాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి. ఇప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జోరుగా జరుగుతున్నా యి. దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమాను ఒక అడ్వెంచర్స్ సినిమాగా చేయబోతున్నాడు. అమెజాన్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం ఉండబోతుందట.ఇక త్రివిక్రమ్ సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఏప్రిల్ 28 న విడుదల కాబోతుంది అంటున్నారు. అది ఇప్పటివరకైతే సాధ్యం కానీ పరిస్థితులలో ఉందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: