కోలీవుడ్‌ హీరో, హీరోయిన్లు గౌతమ్‌ కార్తీక్‌, మంజిమా మోహన్‌ గత కొద్దికాలం గా ప్రేమ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కూడా వీరి ప్రేమ వ్యవహారంపై పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతుంది.

అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తల ను ఖండిస్తూ వస్తోంది మంజిమా. 'అతని ప్రేమను ఇంకా అంగీకరించలేదని.. ఒకవేళ నిజంగా లవ్‌లో పడితే కచ్చితంగా అందరికీ చెప్తాను' అని తప్పించుకుంటూ వస్తోందట  ఈ భామ . అయితే ఎట్టకేలకు తన ప్రేమాయణంపై పెదవి విప్పింద ట మంజిమా. కార్తీక్‌తో లవ్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడి తో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ' మూడేళ్ల క్రితం నా లైఫ్‌లోకి అడుగుపెట్టావు. జీవితాన్ని ఎలా చూడాలో నేర్పించావు. అన్నీ కోల్పోయి దిక్కుతోచని పరిస్థితులెదురైన ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చావు. నాలా నేను ఉండాలని నేర్పించావు. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు. అందుకే నీతో ప్రేమతో పడిపోయాను. నువ్వు నన్ను ప్రేమించిన తీరే నీలో నాకు నచ్చింది. నా లైఫ్‌ లో నువ్వు ఎప్పటికీ ప్రత్యేకమే' అని తన ప్రేమకు అక్షర రూపమిచ్చింద ట మంజిమ.

అటు గౌతమ్‌ కూడా ఇవే ఫొటోల ను షేర్‌ చేసి ' మా స్నేహం గాఢమైన ప్రేమ గా మారినందుకు ఎంతో సంతోషంగా ఉందని మా మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణించడానికి ప్రేమ అనే పదం కూడా సరిపోదేమో. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని . నీ నుంచి ప్రతినిత్యం కడదాకా ప్రేమను పొందనివ్వుఒక్కటిగా ప్రయాణం మొదలు పెట్టేందుకు ఇక వేచి చూడలేను' అని ఇన్‌స్టా వేదికగా తమ రిలేషన్‌షిప్‌పై ఓపె న్‌ అయ్యాడట.వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కంగ్రాట్స్ అంటూ అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: