కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికగా కన్నడ హీరోయిన్ హరిప్రియను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రతినాయకుడిగా జగపతిబాబును ఎంపిక చేసుకున్నారు.
ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కూడా ఒకటి ఉందట. ఈ పాత్రకిగాను వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో తమిళ చిత్రాల్లో లేడీ విలన్ పాత్రల ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అద్భుతమని తెలిసిందే. అందువల్లనే లేడీ విలన్ పాత్రకి ఆమెను తీసుకున్నారట. వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకోవడం వలన ప్రాజెక్టు క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతంలో పందెంకోడి2లో వరలక్ష్మి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాలయ్య, జగపతిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన లెజండ్ చిత్రం ఎంతగా హిట్ అయిందో తెలిసిన విషయమే మళ్ళీ వీరిరువి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతిబాబు ఇటు ప్రతినాయకుడిగా, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ను చాలా బిజీగా గడుపుతున్నారు.