గత కొన్ని సంవత్సరాలుగా విజయనిర్మల - కృష్ణ ఇద్దరూ విజయనిర్మల కుమారుడు నరేష్ ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా విజయనిర్మల మృతి కృష్ణను బాగా కృంగతీసింది. విజయనిర్మల మృతి కృష్ణకు తీరని లోటు చేకూర్చింది. ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి మహేష్ బాబు, రమేష్ బాబు ఇద్దరూ కలిసి ఇల్లు మారితే అయినా మనసు కుదిటపడుతుందని ... తమ ఇంటికి రావాలని ఒప్పించే ప్రయత్నం చేశారని సమాచరం.
నిజానికి సూపర్ స్టార్ కృష్ణ - విజయనిర్మల అన్యోన్య దాంపత్యం గురించి అందరికి తెలిసిందే. కృష్ణకు తన సొంత భార్య, పిల్లల కంటే విజయనిర్మల... నరేష్తోనే ఎక్కువ అనుబంధంతో ఉండేవారు. నరేష్తో ఎప్పటి నుంచో కలిసి ఉంటున్న కృష్ణ.. విజయనిర్మల చనిపోయినందువల్ల తాను నరేష్ ని వదిలి రాలేనని తన నిర్ణయాన్ని చెప్పారట.
అలాగే ఈ ఇంట్లోనే విజయనిర్మల జ్ఞాపకాలు చాలా ఉన్నాయని… ఆ ఇంటిని వదిలే ప్రసక్తే లేదని కృష్ణ చెప్పినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి నరేష్ చాలా ఆనందించారట. అయితే మహేష్ బాబు మరియు రమేష్ బాబు తండ్రి నిర్ణయానికి అడ్డు చెప్పకుండా, కృష్ణ ఒంటరిగా ఫీలవకుండా ఎప్పటికప్పుడు తమ కుటుంబ సభ్యలతో తండ్రిని కలిసి వస్తున్నారట.