బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ "కబీర్ సింగ్" సక్సెస్ తో ఫుల్ జోష్ లోఉన్నాడు.ఆయనకు గత కొన్ని సంవత్సరాలుగా సరియైన హిట్ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి నాలుగు సినిమాలు కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ ఆడలేదు.అలాంటి సమయంలో తెలుగులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకోండ హీరోగా వచ్చిన "అర్జున్ రెడ్డి" పై ఆయన కన్ను పడింది. అర్జున్ రెడ్డి తెలుగులో సంచలన విజయం సాధించి ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
ఈ రీమేక్ ను హిందీ లో సూపర్ సక్సెస్ చేయలంటే అది సందిప్ రెడ్డి వల్లనే అవుతుంది అని భావించి ఆ విషయన్ని సందీప్ కు చెప్పాడు. ఈ ప్రాపోసల్ సందీప్ ఓకే చెప్పడంతో,హిందీ లో అర్జున్ రెడ్ది రీమేక్ పట్టాలు ఎక్కింది.సందీప్ రెడ్డి దర్శకత్వంలో షాహిద్ కపూర్ కీరా అద్వాని లు జంటగా వచ్చిన "కబీర్ సింగ్" ఘనవిజయం సాదించింది.ఈ సినిమా దాదాపు 300 కోట్లూ వసులు చేసి 2019 లో బాలీవుడ్ నెం.1 సినిమా గా నిలిచింది. షాహిద్ సినిమా ఇప్పటి వరకు 100 కోట్లు క్రాస్ చెయ్యలేదు.ఈ సినిమా విజయం తరువాత షాహిద్ 35 కోట్ల రెమ్యూనరెషన్ డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంత ఉందో మాత్రం తెలియదు.
షాహిద్ కపూర్ కబీర్ సింగ్ హీట్ అయిన సంతోషంలో తన కళల ఇంటిని సోంతం చేసుకున్నాడు.ముంబైలో ధనవంతులు నివసించే వర్లీలో షాహిద్ ఒక డూప్లెక్స్ ను కోన్నాడు. ఈ డూప్లెక్స్ ఖరీదు రూపాయలు అక్షరల 56కోట్లు.ఈ డూప్లెక్స్ ఇంటిరియర్ డిజైన్ ని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ చేసింది ..ఈ డూప్లెక్స్ లో500 చదరపు అడుగుల సీ-ఫేసింగ్ బాల్కనీ మరియు స్విమ్మింగ్ పూల్, జీమ్, బాల్ రూమ్,10 కార్లు పార్కింగ్ చేసుకునేంత ఖాళీ స్థలం వంటి సకల సౌకర్యాల తో ఇంద్రలోక స్వర్గాన్ని తలపిస్తుంది. దీనిని రిట్స్ కర్ల్ టన్ అనే ప్రఖ్యాత రియల్టర్ కంపెనీ నిర్మిస్తోంది.