సరైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్ కి ఇంక టాలీవుడ్ లో ఎదురు లేదు అని అంతా అనుకున్నారు. వరుసగా హ్యాట్రిక్ 50 కోట్ల సినిమాలు కొట్టిన బన్నీ ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం మరియు నా పేరు సూర్య సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాడు. ఆ తర్వాత బన్నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్ ను అడిగి మరీ 'అల వైకుంఠ పురం లో' చేయించుకున్నాడు ఈ చిత్రం ప్లానింగ్ మరియు చాలా విషయాల్లో తానే స్వయంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే రెండు ఫ్లాప్ సినిమాలు అతని జోరుకు కళ్లెం వేసినా పునరాగమనం మాత్రం చాలా గట్టిగా చేసిన అల్లు అర్జున్ తర్వాత చిత్రానికి కూడా అదే జోరులో ఇప్పుడు రెడీ అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తన తర్వాత చిత్రం చేస్తున్న అల్లు అర్జున్.... అతనికి మరియు సుక్కుకి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం పైన అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
మొత్తానికి తాను ప్లాన్ చేసినట్టుగానే 'అల వైకుంఠపురములో' భారీ హిట్టయింది. చాలా చిత్రాలతో పోటీ పడినా కానీ సంక్రాంతికి అసలైన విజేతగా నిలిచింది. అల్లు అర్జున్ ఈ విజయంతో మరోసారి టయర్ 1 హీరోల పోటీలోకి వచ్చేశాడు. సుకుమార్తో ఒక వెరైటీ సినిమా తలపెట్టిన అల్లు అర్జున్కి ఇప్పుడీ విజయం చాలా కీలకం. ఒకవేళ ఈ చిత్రం అటు ఇటు అయినట్టయితే సుకుమార్ సినిమా విషయంలో చాలా అనుమానాలు ఏర్పడేవి. దాంతో సుకుమార్కి కూడా తగినంత ఫ్రీడమ్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ రెట్టించిన ఉత్సాహంతో ఈ చిత్రం చేస్తాడు. సుకుమార్కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్ ఎలా వుంటుందనేది రంగస్థలంతో చూపించాడు.
అయితే కొంతమంది గిట్టని వాళ్ళు అల్లు అర్జున్ ని 'కన్నీ' అంటుంటారు. వారు ఏ ఉద్దేశంతో అన్నా కూడా తన తెలివితేటలతో తన సినీ భవిష్యత్తుని గాడిలో పెట్టుకున్న అల్లు అర్జున్ ని కొనియాడకుండా ఉండలేం.