నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బాలయ్య ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడా అని గబారా పడుతున్నారట. వెటరన్ డైరెక్టర్స్ తో రిస్క్ చేస్తుండటమే బాలయ్య ఫ్యాన్స్ లో టెన్షన్ కు కారణమట. ట్రెండ్ సెట్టింగ్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో బాలయ్య సినిమా చేస్తుండటం ఫ్యాన్స్ కు నచ్చడం లేదట. బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో ఫ్యాన్స్ సినిమా ఎందుకు వద్దంటున్నారో తెలుసా.. 

 

గత కొంతకాలంగా సీనియర్ హీరో బాలకృష్ణ ఫ్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. బాలయ్య నటించిన గత చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు బాలకృష్ణకు హిట్ తప్పనిసరి అయిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలయ్య, బోయపాటి శీను లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో న్యూమూవీ చేస్తుండటం నందమూరి ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రోరింగ్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఆ తర్వాత బాలయ్య మళ్లీ వెటరన్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండటంతో ఆశ్చర్యంగా మారింది. 

 

బోయపాటి శీను తర్వాత బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒకప్పుడు బాలయ్య, బి గోపాల్ బాక్సాఫీస్ అంటే బాక్సాఫీస్ బొనాంజ అనే చెప్పాలి. ఈ కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సమర సింహారెడ్డి, నరసింహానాయుడు చిత్రాలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్ గానిలిచాయి. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు ఫామ్ లో లేడు. దీంతో బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

 


బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం పల్నాటి బ్రహ్మనాయుడు ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో హరహరమహాదేవ అనే సినిమాను మొదలుపెట్టారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ వీరి కలయికలో సినిమా వస్తుందనే వార్తలు నందమూరి ఫ్యాన్స్ లో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. బి.గోపాల్ చివరిగా గోపీచంద్ హీరోగా దర్శకత్వం వహించిన ఆరడుగుల బుల్లెట్ డిజాస్టర్ గా నిలిచింది. ఫ్లాప్స్ తో వెనుకబడ్డ బాలయ్య వెటరన్ డైరెక్టర్స్ తో అది కూడా ఫాంలో లేని డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తుండటం సాహసమే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: