లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో ఎవ్వరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ప్రతీ ఒక్కరూ తమలోని క్రియేటివిటీని బయటకి తీస్తున్నారు. తమలోని నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఈ లాక్డౌన్ సమయాని బాగా ఉపయోగిస్తున్నారు. అయితే సినిమా సెలెబ్రిటీలు లాక్డౌన్ ని చాలా బాగా గడుపుతున్నారు. సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల దగ్గరవుతూ తమ అభిమానులకి ఆనందం పంచుతున్నారు. 

 

 

ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్ తో, బోల్డ్ నెస్ తో చెలరేగిపోయిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈ లాక్డౌన్ సమయంలో అభిమానులని బాగా ఎంగేజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ కుర్రకారు మతిని పోగొడుతోంది. మొన్నటికి మొన్న పిల్లో ఛాలెంజిలో భాగంగా ఒంటి మీద అఛ్చాదన లేకుండా కేవలం పిల్లోని చుట్టుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

 

అయితే మళ్లీ తాజాగా వినూత్నంగా కనిపించింది. ఈ సారి న్యూస్ పేపర్ ని చుట్టుకుని అందరినీ ఆశ్చర్యపరించింది. న్యూస్ పేపర్ ని డ్రెస్ లాగా చేసి టాప్ గా వేసుకుంది. ఇలా రెడీ అయిన ఫోటోలని షేర్ చేసింది కూడా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేపర్ డ్రెస్ వేసుకున్న పాయల్ ని చూస్తుంటే నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన ఆహ నాపెళ్లంట సినిమా గుర్తుకు వస్తుంది.

 

 

జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పిసినారి కోటశ్రీనివాసరావు పేపర్ లుంగీ కట్టుకుని అందరినీ నవ్విస్తాడు. అయితే ఇక్కడ పాయల్ పేపర్ డ్రెస్ వేసుకుని అందరినీ కవ్విస్తుంది. నిజంగా పాయల్ కి చాలా ధైర్యమనే చెప్పాలి. ఈ లాక్డౌన్ ముగిసే వరకు పాయల్ ఇంకెని అవతారాల్లో కనిపించనుందో. పాయల్ ప్రస్తుతం ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: