మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. దేవాలయాల భూములు కుంభకోణాలు నేపద్యంలో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక లాక్ డౌన్ కి ముందు 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్ర చేయనుండగా ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటించనున్నట్లు టాక్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మిస్తుండగా తిరు దీనికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇకపోతే దీని తర్వాత వి వినాయక్ దర్శకత్వంలో మలయాళం మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్లో అలానే యువ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ మూవీ వేదళం రీమేక్లో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. అతి త్వరలో ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇక వీటి అనంతరం మెగాస్టార్ తదుపరి నటించబోయే సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికే రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. ఇక ఆ విషయాలు అటుంచితే అతి త్వరలో మెగాస్టార్ బయోపిక్ కూడా తెరపైకి రానున్నట్లు సమాచారం. ఒక యువ హీరో ఇందులో మెగాస్టార్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా కథనాలను ఎంతో అద్భుతంగా సిద్ధం చేయించిన ప్రముఖ నిర్మాత ఒకరు అతి త్వరలో దీన్ని పట్టాలెక్కించ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఓ కీలకమైన సన్నివేశం లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు కూడా కొన్ని క్షణాల పాటు కనిపించనున్నారని ఆ సీన్ మెగా ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ గా నిలవటం ఖాయం అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోందని అలాగే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీని పూర్తి డిటేల్స్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: