మంచు విష్ణు హీరో గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ సినిమా కి కొనసాగింపుగా ఢీ & ఢీ అనే సినిమా ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సరిగ్గా 13 సంవత్సరాలక్రితం వీరి కాంబో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మళ్ళీ ఈ సినిమా ని టచ్ చేయడం వీరికే చెల్లిది.. గత కొన్ని సినిమా లుగా శ్రీనువైట్ల సినిమాలు అన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. ఆగడు, బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా వరుస సినిమా లు ఫ్లాపులు గా నిలిచాయి..దాంతో చాలా గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడు.

ఢీ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా ఈ సీక్వెల్ లో ఎవరు హీరోయిన్ గా నటించబోతున్నారన్నది ఆసక్తి కరంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఇద్దరు టాప్ హీరోయిన్స్ నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారితో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ప్రధాన కథానాయిక పాత్ర కోసం అను ఇమాన్యుయేల్ లేదా ప్రగ్యా జైస్వాల్ ను లాక్ చేస్తారట. ఆ మేరకు శ్రీను వైట్ల ప్రణాళికలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు మళ్ళీ ఉంటాయా అన్నది ఆసక్తి కరంగా మారిపోయింది.. శ్రీహరి, బ్రహ్మానంద పాత్రలు ఎలా డిజైన్ చేస్తారో చూడాలని అభిమానులు చూస్తున్నారు.. శ్రీహరి ఇప్పుడు లేరు అయన పాత్రను ఏవిధంగా మలుస్తారో చూడాలి.. బ్రహ్మానంద పూర్తి గా సినిమాలకు దూరం గా ఉన్నారని చెప్పాలి.. అయన పాత్రను ఎలా ఉంచారో చూడాలి. జయప్రకాష్ రెడ్డి ఈ లోకాన్ని వీడి వెళ్లారు. సీక్వెల్ లో వాళ్ల పాత్రల్ని మరొకరితో చేయించకపోవడమే మంచిది. ఇప్పుడెలాగూ టైటిల్ లో సీక్వెల్ అని చెప్పి, సినిమాలో కొత్త కథలు ప్రజెంట్ చేస్తున్నారు. 'డి & డి' కూడా అదే ఫార్మాట్ లో ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: