పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ ప్రతిష్టాత్మక పీరియాడికల్ పాన్ ఇండియా రేంజ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కు ఎంతో సన్నిహితుడు అలానే ప్రముఖ నిర్మాత అయిన ఏఎం రత్నం ఎంతో భారీ ఖర్చుతో తన ప్రతిష్టాత్మక మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పలువురు దిగ్గజ నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ కి ముందు పలువురు ఇతర నటులపై కీలక సన్నివేశాలు తీసిన యూనిట్, అతి త్వరలో దీని తదుపరి షెడ్యూల్ ని మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ లో పవర్ స్టార్ పాల్గొననున్నారని, కథ, కథనాల పరంగా ఈ సినిమా తప్పకుండా అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. వేదం సినిమా నుండి మొన్నటి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల వరకు హృద్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దర్శకడు క్రిష్, తొలిసారిగా పవర్ స్టార్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలో కొంత కమర్షియల్ హంగులు జోడించి కొంతవరకు తన పంథాని మార్చుకోనున్నట్లు సమాచారం.

సినిమా మొత్తం నిజానికి తన స్టైల్ లోనే సాగినప్పటికీ, పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు కూడా పొందుపరిచి అందరి ఆమోదంతో మంచి సక్సెస్ అందుకోవాలని ఆయన స్క్రిప్ట్ ని ఎంతో పక్కాగా రాసుకున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ కి జోడిగా ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్తే అని చెప్పాలి.....!!




మరింత సమాచారం తెలుసుకోండి: