లాక్ డౌన్ కి ముందు పలువురు ఇతర నటులపై కీలక సన్నివేశాలు తీసిన యూనిట్, అతి త్వరలో దీని తదుపరి షెడ్యూల్ ని మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ లో పవర్ స్టార్ పాల్గొననున్నారని, కథ, కథనాల పరంగా ఈ సినిమా తప్పకుండా అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. వేదం సినిమా నుండి మొన్నటి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల వరకు హృద్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దర్శకడు క్రిష్, తొలిసారిగా పవర్ స్టార్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలో కొంత కమర్షియల్ హంగులు జోడించి కొంతవరకు తన పంథాని మార్చుకోనున్నట్లు సమాచారం.
సినిమా మొత్తం నిజానికి తన స్టైల్ లోనే సాగినప్పటికీ, పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు కూడా పొందుపరిచి అందరి ఆమోదంతో మంచి సక్సెస్ అందుకోవాలని ఆయన స్క్రిప్ట్ ని ఎంతో పక్కాగా రాసుకున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ కి జోడిగా ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్తే అని చెప్పాలి.....!!