మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దబాంగ్ 3లో నటించిన సయి మంజ్రేకర్ ఆ మూవీతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో ఛాన్స్ అంటే సయి మంజ్రేకర్ కు లక్కీ ఛాన్స్ అన్నట్టే.
పుష్ప సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబో సినిమా మాత్రం 2022 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ తో వస్తున్న కొరటాల శివ ఆచార్యతో అదే తరహా కథతో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమా కథ కూడా క్రేజీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.