అల వైకుంఠపురములో తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివసినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దబాంగ్ 3లో నటించిన సయి మంజ్రేకర్ ఆ మూవీతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో ఛాన్స్ అంటే సయి మంజ్రేకర్ కు లక్కీ ఛాన్స్ అన్నట్టే.

పుష్ప సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబో సినిమా మాత్రం 2022 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ తో వస్తున్న కొరటాల శివ ఆచార్యతో అదే తరహా కథతో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమా కథ కూడా క్రేజీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: