2020 సంవత్సరం మొత్తం ప్రపంచం స్తంభించి పోయింది. సామాన్యులు నుంచి ప్రముఖుల వరకు ఏ ఒక్కరూ కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే 2020 చివరకు వచ్చే సరికి కొంచెం కొంచెంగా ప్రపంచం మొత్తం ప్రయాణాలు నెమ్మదిగా మొదలయ్యాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మన హీరోలు చాన్స్ దొరికితే ఏదో ఒక వెకేషన్‌కు వెళ్లిపోతూ ఉంటారు. కొంత మంది సోలోగా ట్రిప్‌లు వస్తే మరి కొంత మంది తమ కుటుంబంతో పాటు కలిసి వెళ్తారు. ఎక్కువగా వెకేషన్‌లకు వెళ్లే వారిలో ముందు వరుసలో ఉండే నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అవును.. మహేష్ బాబు తనకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా సరే ఫ్యామిలీతో కలిసి విదేశీ యాత్రలకు వెళ్లిపోతారు. ఇటీవలే ఆయన ఓ విదేశీ యాత్రకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో తాను, తన సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కలిసి బీచ్‌లో గవ్వలతో ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఫొటో పెట్టి గతేడాది సమ్మర్‌లో తమ కుటుంబం మొత్తం స్పెయిన్ వెకేషన్‌కు వెళ్లినట్టు చెప్పింది. ప్రతి సమ్మర్‌కు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఏదో ఒక దేశానికి చెక్కేస్తారు. 2020లో కరోనా మహమ్మారి ఉండటంతో ఆయన విదేశీ యాత్ర చేయలేకపోయారు.

కానీ.. ఈ సారి మాత్రం ఆయన మళ్లీ ఏదో ఒక దేశానికి ఫ్యామిలీతో వెళ్లనున్నారని.. ఈ సారి కూడా యూరప్ ట్రిప్‌కు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అనేక దేశాల్లో మొదలై పోయింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించేశాయి. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: