అవును.. మహేష్ బాబు తనకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా సరే ఫ్యామిలీతో కలిసి విదేశీ యాత్రలకు వెళ్లిపోతారు. ఇటీవలే ఆయన ఓ విదేశీ యాత్రకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో తాను, తన సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కలిసి బీచ్లో గవ్వలతో ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఫొటో పెట్టి గతేడాది సమ్మర్లో తమ కుటుంబం మొత్తం స్పెయిన్ వెకేషన్కు వెళ్లినట్టు చెప్పింది. ప్రతి సమ్మర్కు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఏదో ఒక దేశానికి చెక్కేస్తారు. 2020లో కరోనా మహమ్మారి ఉండటంతో ఆయన విదేశీ యాత్ర చేయలేకపోయారు.
కానీ.. ఈ సారి మాత్రం ఆయన మళ్లీ ఏదో ఒక దేశానికి ఫ్యామిలీతో వెళ్లనున్నారని.. ఈ సారి కూడా యూరప్ ట్రిప్కు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అనేక దేశాల్లో మొదలై పోయింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించేశాయి. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.