సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పుట్టినరోజు ఈ రోజు.. జనవరి 22, 2021 తో 49 వ ప్రాయంలోకి అడుగుపెట్టింది నమ్రత ..ఇక 1993 లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రత.. ఆ తర్వాత పలు హిందీ సినిమాలతో పాటు తెలుగులో కూడా నటించింది. ఇక తెలుగులో మహేష్ సరసన వంశీ చిత్రంలో నటించిన నమ్రత.. మహేష్‌తో ప్రేమలో పడి అతన్నేపెళ్లిచేసుకుంది. వీరి వివాహం 2005 ఫిబ్రవరిలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార. నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ దుబాయ్‌లో సింపుల్‌గా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా మహేష్ రాస్తూ.. ఈరోజు తనకెంతో ప్రత్యేకమని నేనెంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు ఈరోజు..నమ్రత.. నీతో ప్రతిరోజూ ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం మరెంతో ప్రత్యేకంగా ఉందంటూ బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా నమ్రతను ఉద్దేశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే బాస్‌ లేడీ అంటూ రాసుకున్నాడు. అంటే నమ్రతను ముద్దుగా మహేష్ బాస్ లేడి అని పిలుస్తాడా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక మహేష్ పెట్టిన ఆ పోస్ట్‌కు నమ్రత సంతోషం వ్యక్తం చేస్తూ.. నా ప్రతి ఏడాదినీ ఎంతో స్పెషల్‌గా చేస్తున్నందుకు థ్యాంక్యూ..

లవ్‌ యూ అంటూ రిప్లై ఇచ్చింది..ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుందని సమాచారం..థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: