ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్, మాస్టర్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన ‘ఉప్పెన’ సినిమా మాత్రం కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ తో చిత్ర నిర్మాతలతో పాటు దర్శకులు ఫీలవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఇపుడు మిగతా ఇండస్ట్రీలో చూపు ఈ సినిమాపై పడింది. అంతేకాదు ఈ సినిమా హక్కులు కోసం పోటీ పడుతున్నారు.

వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ప్ర‌భజ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్ల‌ర్లేదు. 70 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు త‌మిళం, హిందీ భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నారు. త‌మిళంలో విజ‌య్ త‌న‌యుడు సంజ‌య్ రీమేక్ చేయ‌నున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు రాగా, ఇప్పుడు హిందీలోను రీమేక్ కానున్న‌ట్టు తెలుస్తుంది.

బాలీవుడ్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అతి త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. మైత్రి మూవీమేక‌ర్స్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఉప్పెన చిత్రాన్ని డెబ్యూ డెరెక్ట‌ర్ బుచ్చి బాబు తెర‌కెక్కించారు. ఈ మూవీ సినీ ప్రియుల‌నే కాక సెల‌బ్రిటీల‌ను సైతం ఆక‌ట్టుకుంది. చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబు వంటి సెల‌బ్స్ కూడా ఉప్పెన‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ జంటగా నటించిన సినిమాను బాలీవుడ్‌‌తో పాటు తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. మరోవైపు ఉప్పెన సినిమాను తమిళంలో విజయ్ కుమారుడు సంజయ్ తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అన్ని భాషలకు సంబంధించిన రీమేక్స్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: