‘రోజా’ సినిమా హీరోగా అరవింద్ స్వామికి వచ్చిన క్రేజ్ కంటే ‘తనీ ఒరువన్’ సినిమాలో విలన్ గా చేసిన అరవింద్ స్వామికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. గత రెండు వారాలుగా దక్షిణాది సినిమారంగంలో అతడి పేరు మారు మ్రోగి పోతోంది.  గత నెల ఆగస్టు 28న పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈసినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్టయింది. అక్కడ హిట్టవడమే కాదు ఆతరువాత ఈ సినిమా దక్షిణాదిలోని అందరి హీరోల  దృష్టిని ఆకర్షించింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఐదు భాషల నుంచి ఈసినిమాను రీమేక్ చేయడానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అంటే ఈసినిమా క్రేజ్ ఏమిటో అర్ధం అవుతుంది. తెలుగులో డీవీవీ దానయ్య ఈసినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ లో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈసినిమాకు హీరో ఎవరు అయినా విలన్ గా అరవింద్ స్వామి నటిస్తేనే బాగుంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాలో  హైలైట్ గా నిలిచిన అరవింద్ స్వామి పాత్రను ఎవరు రీప్లేస్ యలేరు అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

పైకి హీరోలా మంచి వాడిలా మచి వాడుగా కనిపిస్తూనే విలన్ పాత్రలో కనిపించే విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు అరవింద్ స్వామి. అప్పటి దాకా హీరో పాత్రలో చూసిన ఈ కోలీవుడ్ హీరోని నెగిటివ్ పాత్రలో చూస్తూ బ్రహ్మరధం పడుతున్నారు ప్రేక్షకులు. దీనితో ‘తనీ ఒరువన్’ ను రీమేక్ చేయాలనుకున్న దర్శక నిర్మాతలు అంతా విలన్ రోల్ కు అతడినే తీసుకోవాలని నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే అరవింద్ స్వామి మాత్రం ఈ క్రేజ్ పట్ల ఏమి ఆశక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈవిలక్షణ నటుడుకి నటించిన పాత్రనే మళ్ళీమళ్ళీ రీమేక్ లలో నటించాలి అంటే బోర్ అంటున్నాడు అరవింద్ స్వామి. క్రేజ్ ఉండగానే కోట్లు వెనకేసుకుంటున్న నటులు ఉన్న నేటిరోజులలో అరవింద్ స్వామి చెపుతున్న సమాధానాలు చూసి చాలామంది టాప్ దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నట్లు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: