కరోనా సమయంలో అనేకమంది పేదలకు, సామాన్యులకు, అన్నార్తులకు దేవుడిగా మారాడు సోనూసూద్. రీల్ విలన్ అయినా.. రియల్ హీరోగా మారాడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో లక్షల మందిని తమ సొంత ప్రాంతాలకు పంపాడు. దానికోసం విమానాలు, బస్సులు, ట్రైన్లు అన్ని రకాల ప్రయాణ సాధనాలనూ ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపాడు. ఆర్థికంగా అండగా నిలిచాడు. ఇక ఈ ఏడాది మళ్లీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా సోనూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, మెడిసిన్ వంటివన్నీ అందిస్తూ రాత్రింబవళ్లు సేవ చేస్తున్నాడు.

సోనూ గొప్పతనం ప్రజలను కూడా కదిలిస్తోంది. దీంతో దేశం నలుమూలల నుంచి ఎంతో మంది సోనూకు విరాళాలు అందిస్తున్నారు. అలాంటి వారిలో కొంతమంది పేదలుకూడా ఉన్నారు. ఇటీవల ఓ అంధురాలైన మహిళ తన 3 నెలల పెన్షన్ డబ్బులను సోనూకు విరాళంగా పంపింది. దీంతో ఆమెను ప్రశంసిస్తూ సోననూసూద్ ఓ ట్వీట్ కూడా చేశాడు. ‘తన దృష్టిలో ప్రపంచంలోనే ఆమె అత్యంత ధనవంతురాలం’టూ కీర్తించాడు. కాగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగ యువకుడు సోనూకు విరాళం అందించాడు. దీంతో అతడిని కుర్రాడిని ప్రశంసల్లో ముంచెత్తాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన అఫ్రిది అనే యువకుడు తన 3 నెలల జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు విరాళంగా పంపాడు. రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న అఫ్రిది ఒక యాక్సిడెంటులో కాళ్లు పోగొట్టుకున్నాడు. అయినాసరే ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు పంపించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సోనూసూద్.. ఇలాంటి హీరోలే ప్రపంచాన్ని మరింత గొప్ప ప్రదేశంగా మారుస్తారని పేర్కొన్నాడు.


అలాగే అఫ్రిది చేసిన సాయంతో తాను కచ్చితంగా ఒకరి జీవితంలో నవ్వులు పూయిస్తానని హామీ ఇచ్చాడు. కాగా.. కరోనా బారిన పడిన వారికి సోనూ చేస్తున్న సాయాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ అనేకమంది ఆయనకు విరాళాలు పంపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: