ప్రముఖ సీనియర్ నటుడు రజనీకాంత్ కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం పాలైన ఆయన హెల్త్ చెకప్ చేయించుకొని.. తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని.. రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తాను వరల్డ్ క్లాస్ డాక్టర్ల సలహాలు తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని తెలుస్తోంది. ఐతే త్వరలోనే
సూపర్ స్టార్ రజనీకాంత్ మెడికల్ చెకప్ కోసం
అమెరికా కి వెళ్ళాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలోనే విమాన రాకపోకలు రద్దు చేయగా.. రజనీకాంత్
అమెరికా కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని
కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అయితే తాజా నివేదికల ప్రకారం..
కేంద్ర ప్రభుత్వం రజనీకాంత్ కి
అమెరికా దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరలోనే
అమెరికా కి వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి కి సంబంధించిన పరీక్షలు చేయించుకోనున్నారు. అయితే రజనీకాంత్ ఒక ప్రత్యేకమైన ఫ్లయిట్ లో వెళ్లనున్నారు. అయితే ఇదే ఫ్లయిట్ లో తమ కుటుంబ సభ్యులను సైతం తీసుకెళ్లనున్నారు. ఈ ఫ్లయిట్ లో 14 మంది వెళ్లేందుకు అవకాశం ఉంది.
నిజానికి రజనీకాంత్ అల్లుడు, నేషనల్ అవార్డు
విన్నర్ ధనుష్ తన భార్య, కుమారులతో సహా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఒక
హాలీవుడ్ సినిమా చిత్రీకరణ నిమిత్తం ఆయన
అమెరికా వెళ్లారు. అయితే రజనీకాంత్
అమెరికా కి వెళ్లి మెడికల్ చెకప్ చేయించుకోనుండగా..
ధనుష్ రజనీకాంత్ కి సహాయం చేయనున్నారు. కొద్ది రోజుల్లోనే అమెరికాలో రజనీకాంత్ కుటుంబ సభ్యులందరూ కలుసుకోనున్నారు.
ఇకపోతే రజనీకాంత్ `అన్నాత్తే` అనే ఒక యాక్షన్ డ్రామా సినిమాలో నటిస్తున్నారు.
డైరెక్టర్ శివ కుమార్ రూపొందిస్తున్న ఈ
తమిళ సినిమాలో కీర్తిసురేష్, నయనతార, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక మేజర్ షెడ్యూల్
హైదరాబాద్ నగరంలోనే పూర్తయింది.