యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనంది త్వరలో ప్రకటిస్తారు. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలట్ రైట్స్ దుమ్ముదులిపే రేటుకి అమ్ముడయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ 225 కోట్లు పలికాయట.

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది మనకు తెలిసిందే. ఆయన ప్రతి సినిమా రికార్డ్ ప్రైజ్ లో అమ్ముడవుతున్నాయి. సాహో మధ్యలో కొంత నిరాశపరచినా రాధే శ్యామ్ మాత్రం అంచనాలకు మించి ఉంటుందని అనిపిస్తుంది. దానికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో సెకండ్ హయ్యెస్ట్ రికార్డ్ అందుకుంది. ప్రభాస్ సినిమా అంటే రికార్డులు సలాం కొట్టాల్సిందే. నేషనల్ స్టార్ గా ప్రభాస్ ప్రతి సినిమాకు తన టార్గెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

రాధే శ్యామ్ తో పాటుగా ప్రశాంత్ నీల్ తో సలార్, ఓం రౌత్ తీస్తున్న ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు కూడా ఒకదానికి మించి మరోటి క్రేజ్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా కె.జి.ఎఫ్ లాంటి బీభత్సమైన హీరోయిజం చూపిస్తున్న ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ అంటూ వస్తున్న ప్రభాస్ ఆ సినిమాలో ఎలాంటి హంగామా చేస్తాడో అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆదిపురుష్ లో మాత్రం ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. రాధే శ్యాం తో పాటుగా రాబోతున్న రెండు సినిమాలతో కూడా ప్రభాస్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేస్తాడని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని ఫ్యాన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: