అలనాటి నటుడు ఎస్
వి రంగారావు ప్రేక్షకులపై ఎంతటి ముద్రవేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆహార్యం, ఒడ్డు పొడుగు, అన్ని చూస్తే ఎంతటి వాడికైనా భలే ఉన్నాడే అనిపించక తప్పదు. ఎస్వీ రంగారావు నటించిన
సినిమా లు చూస్తుంటే ప్రేక్షకులు అలానే ఆయన్నే చూస్తూ ఉండిపోతారు. పక్కన ఏ నటుడు ఉన్నా కూడా పట్టించుకోరు. అలాంటి నటుడు తర్వాత తన వారసులను ఎందుకు సినిమాలలోకి తీసుకు రాలేదు అన్న అనుమానం తప్పకుండా ఎవరికైనా వస్తుంది. ఈ విధంగా ఎస్వీ రంగారావు తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించగా అది విఫలం అయిందట.

ఎస్.వి.రంగారావు తనయుడు కోటేశ్వరరావు హీరోగా
సినిమా కూడా మొదలు పెట్టారు. కొంత షూటింగ్ చేసి ఆ తర్వాత మధ్యలోనే ఆ సినిమాను ఆపేశారు. పలు కారణాల వల్లనే ఈ
సినిమా ఆగిపోయింది అని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొడుకు సినిమాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎస్వీ రంగారావు కొడుకు జనరేషన్ సినిమాల్లోకి రాలేదు కానీ మూడవ జనరేషన్ అయిన ఆయన మనవడు సినిమాల్లోకి వచ్చాడు. ఆయన రెండవ మనవడు ఎస్.వి.రంగారావు కథానాయకుడిగా
మిస్టర్ 7 అనే
సినిమా తో
టాలీవుడ్ కి పరిచయమయ్యారు.
2012లో వచ్చిన ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించక పోవడంతో ఆయన ఆ తర్వాత సినిమాలు ఏమీ చేయలేదు. ఆ టైంలో
హీరో రంగారావు మాట్లాడుతూ.. తాతగారు మరణించి 36 సంవత్సరాలు అయింది. ఆయన వారసులు ఎవరు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి లేదని అందరూ అనుకుంటున్నారు. కొన్ని కుటుంబ కారణాల వల్లనే నా సినీ ఎంట్రీ ఆలస్యమైందని
జూనియర్ ఎస్
వి ఆర్ అన్నారు. ఎస్వీఆర్ సినీ కార్ప్ రేషన్ అనే పేరుతో వరుస సినిమాలు తెరకెక్కిస్తామని చెప్పారు కానీ ఆ ఒక
సినిమా తర్వాత మళ్ళీ ఏ చిత్రం కూడా ఈ సంస్థ నుంచి రాలేదు.