సినీ ప్రేక్షకులు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకి మంచి ఆదరణను చూపుతున్నారు. కరోనా వలన థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే పద్ధతిని ఎప్పుడో మర్చిపోయారు మన తెలుగు ప్రేక్షకులు.ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఓటిటిల్లో సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా కూడా జనాలు ఒకప్పటిలాగా వస్తారన్న గ్యారెంటీ లేదు.అందుకే రిస్క్ చేయడం ఎందుకని కొందరు దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీ వేదికల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇక ఇదే బాటలో ఇటీవల విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' సినిమా ఓటిటిలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.

జూలై 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాని ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇక ఇదే క్రమంలో వెంకీ నటిస్తున్న మరో చిత్రం 'దృశ్యం2' ని కూడా ఓటిటిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.ఒకవేళ థియేటర్లో సినిమా విడుదల చేసి.. జనం రాకుంటే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది.దీంతో చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నారు.ఇక ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

ఈ నేపథ్యంలో తాను నిర్మిస్తున్న 'దృశ్యం2' సినిమాని కూడా ఓటిటిలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. మలయాళంలో మంచి సక్సెస్ ని అందుకున్న దృశ్యం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది.అదే సినిమాని మలయాళంలో సీక్వెల్ గా తీయగా..అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.దీంతో మరోసారి వెంకటేష్ దృశ్యం సీక్వెల్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఇక ఈ సీక్వెల్ లో కూడా వెంకటేష్ సరసన మీనా నటించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 9 లేదా 10 వ తేదీల్లో ప్రముఖ ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: