కోలీవుడ్‌లో రష్మిక మందన్న చాలా దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తుంది.రష్మిక మరోక పాపులర్ హీరో సినిమాలో ఛాన్స్ సంపాదించిందట. వివరాల్లోకి వెళితే కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా చెలరేగి పోతుంది.అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ముందు ఛాయిస్‌గా మారిందని సమాచారం. రీసెంట్‌గా స్టార్ హీరో అయిన  కార్తి హీరోగా నటించిన 'సుల్తాన్' మూవీతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది. అంతేకాదు ఇపుడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే రష్మిక మందన్న సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్‌లో టాప్ టక్కర్ అనే పాప్ సాంగ్ ఆల్బమ్‌తో మెరిసింది.ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ వచ్చింది. దాంతో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్ బై' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో రష్మిక మందన్న ముంబైలోని బాంద్రాలో పూజా హెగ్డే తీసుకున్న ఫ్లాట్‌కు దగ్గరలో సెలబ్రిటీలు ఉండే ప్రదేశంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్ట టాక్ వినిపిస్తుంది.త్వరలోనే అందులోకి గృహ ప్రవేశం చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్‌లో కూడా రష్మిక ఉండటానికి ఓ భారీ కొంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో శివకార్తికేయన్ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం.  అలాగే సూర్య తరువాత సినిమాలో కూడా ఈమెనే తీసుకోబోతున్నట్లు సమాచారం అందింది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంది. రష్మిక తెలుగులో ఈమె వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది రష్మిక మందన ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో 'గీత గోవిందం' సినిమాతో సినిమా చేసింది. ఆ తర్వాత నాగార్జున, నాని లూ కలిసి నటించిన 'దేవదాసు'లో నటించింది. ఇక గత సంవత్సరం సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషనులో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత నితిన్‌తో నటించిన 'భీష్మ' సినిమా కూడా విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాటు పలు క్రేజీ సినిమాలు వున్నాయి. ఈమె తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్‌లో పలు సినిమాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: