బాలీవుడ్ స్టార్ గా గుర్తింపు పొందిన రణ్ వీర్ సింగ్ అలాగే దీపికా పదుకొనేని బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు పొందిన జంట అని తెలిసిన విషయమే. తెలుగులో నాగచైతన్య, సమంత కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో బాలీవుడ్లో కూడా వీరిద్దరికీ అంతే ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరూ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన రామ్ లీలా, పద్మావత్ , బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలలో నటించారు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు 2018 సంవత్సరంలో ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటవడం జరిగింది.
పెళ్లి తర్వాత ఎవరి సినిమాలతో వారు చాలా బిజీ అయిపోయారు అని చెప్పవచ్చు.. ఇక ప్రియాంక చోప్రా లాగే దీపికా కూడా బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాలకు కూడా ఓకే చెప్పడం గమనార్హం. ఇకపోతే ఈమె తాజాగా తన భర్తపై ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే వినాయక చవితి సందర్భంగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో కి ప్రముఖ దర్శకులు ఫరా ఖాన్ తో పాటు దీపిక గెస్ట్ గా రావడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త రణ్ వీర్ సింగ్ వంట చేసి మరీ తినిపిస్తాను అని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలా జరగలేదు. అంటూ ఆమె కంప్లైంట్ చేసింది. వెంటనే అమితాబ్ బచ్చన్ రణ్ వీర్ కి కాల్ చేసి మొత్తం విషయం చెప్పేశారు .ఇది విన్న ఆయన ఈసారి ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆమ్లెట్ తినిపిస్తానని ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది.. ఇక ఇప్పుడు ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.