ఇటు రాజకీయ ప్రవేశం కూడా చేసి సత్తా చాటుతున్నారు రోజా. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినీ గురువు శివ ప్రసాద్ వల్లనే రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం కూడా నటి రోజాకు అందింది. శివ ప్రసాద్ 1999లో సత్యవేడు ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రోజా ఎన్నికల ప్రచారానికి పిలిచారు. గురువు పిలవడంతో వెంటనే ప్రచారం బరిలో దిగారు రోజ. ఆ సమయంలోనే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు రోజా. అలా నటి రోజా టీడీపీలోకి చేరి పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అనంతరం వైఎస్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి వైఎస్సార్సీపీ పార్టీలో తనదైన పాత్ర పోషిస్తున్నారు రోజా.
ప్రస్తుతం వై సి పి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు. రాజకీయ రంగంలో రోజా అంటే ఒక ఫైర్ బ్రాండ్. సినిమా పరంగా, రాజకీయ పరంగా , కుటుంబ పరంగా అమే ఒక గొప్ప రోల్ మోడల్. సినిమాల్లో సునాయాసంగా స్టార్ హోదాకు చేరుకున్న ఈమె .. రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో అవాంతరాలను, ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు. అయినా అన్నిటినీ అధిగమించి నేడు ఈ స్థాయిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు. అటు ఇంటిని, ఇటు తనకు భవిష్యత్తు ఇచ్చిన సినీ కెరీర్ ని, మరోవైపు రాజకీయాల్లో ప్రజా సేవను ఇలా మూడింటినీ బాలన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న రోజా సెల్వమణి మహిళలకే ఆదర్శప్రాయంగా మారారు.