డిసెంబర్ 17 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుండగా ఈ సినిమా పై భారీ స్థాయి లో అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమా దాదాపు ప్రేక్షకులను థియేటర్లకు అలవాటు చేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పుష్ప చిత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తుందని సినిమా వారు సైతం భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ చేయబోయే తదుపరి సినిమా గురించి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
ఇతర హీరోలు ఒక సినిమా చిత్రీకరణ జరుగుతుండగా నే రెండు మూడు సినిమాలకు పైగా అనౌన్స్ చేసి వాటిని లైన్ లో పెట్టుకుంటే అల్లు అర్జున్ మాత్రం పుష్ప సినిమా నీ ఒకటే పట్టుకుని వేలాడడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.సినిమా ల విషయం లో ఫాస్ట్ గా ఉండే అల్లుఅర్జున్ఎందుకు ఇంత స్లో అయ్యాడు అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప మొదటి భాగం పూర్తయిన నేపథ్యంలో రెండవ భాగం చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల గురించి అనౌన్స్ మెంట్ లు చేస్తాడా అనేది చూడాలి.