నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. బాలకృష్ణ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించి నప్పటికీ బాలకృష్ణ అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 1 టాక్ షో అద్భుతమైన సక్సెస్ ని సాధించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించడంతో ఈ టాక్ షో కు ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ సీజన్ 2 ను ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ సీజన్ 2 కు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ప్రకటించింది. మరి కొన్ని రోజుల్లోనే ఆన్ స్థాపబుల్ సీజన్ 2 టాక్ షో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోయే అవకాశం ఉన్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆన్ స్థాపబుల్ టాక్ షో కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెటింటా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించబోయే ఆన్ స్థాపబుల్ సీజన్ 2 టాక్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ఎపిసోడ్ కు గెస్ట్ గా రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: