టాలీవుడ్
ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో
మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన మంచు విష్ణు తాజాగా జిన్నా అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. మంచు విష్ణు హీరో గా తెరకెక్కిన జిన్నా
మూవీ లో
సన్నీ లియోన్ ,
పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటించగా , సూర్య ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రా లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరి పోయే క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. జిన్నా
మూవీ యూనిట్ తాజాగా ఈ
సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
అక్టోబర్ 21 వ తేదీన ఈ
మూవీ ని విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఆఖరుగా మోసగాళ్లు అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ లో
కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు
సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. మరి మోసగాళ్లు
మూవీ తర్వాత
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన
చిన్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. జిన్నా
మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అని రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.