మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు మూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీ ని 2023 వ సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు , తమిళ , కన్నడ , హిందీ సినిమా లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న రష్మిక మందన ప్రస్తుతం తన ఫోకస్ ను ఎక్కువగా హిందీ సినిమాల పైన పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం పలు హిందీ సినిమాలలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన "గుడ్ బై" అనే హిందీ మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో అమితా బచ్చన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , వికాస్ బహ్ల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ డిజిటల్ విడుదలకు రెడీ అయింది. ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ డిసెంబర్ 2 వ తేదీ నుండి గుడ్ బై మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అల్లరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: