
ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కంగనా లారెన్స్ ఇద్దరు కూడా ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేసారు. ఇక వీరిద్దరి మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో హైలెట్ అయ్యే పాయింట్ చిన్న క్లూ ద్వారా బయటపడిపోయింది. చంద్రముఖి సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించలేదు కేవలం ఆమె శరీరంలోకి చంద్రముఖి ఆవహించినప్పుడు మాత్రమే తాను నాట్యం చేస్తూ, రాజు పై ప్రతీకారం తీర్చుకునే లాగా కనిపిస్తుంది. కానీ సీక్వెల్స్ సినిమాలో మాత్రం అసలైన చంద్రముఖిని చూపించబోతున్నారని ఆ అసలైన చంద్రముఖినే కంగనా అంటూ వీరి మాటలు బట్టి తెలిసిపోయింది. కనిపించని దెయ్యంగానే అంత భయపెడితే ఇప్పుడు ఏకంగా నిజంగానే బంగాళాకు వస్తే జరగబోయే పరిణామాల నేపథ్యంలో కొనసాగింపుగా ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా కూడా చంద్రముఖి స్థాయిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేక రజనీకాంత్ సినిమాని ముందుకు నడిపించినంతగా లారెన్స్ ఈ సినిమాని ముందుకు నడిపిస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.