సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదలవుతు ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే సెన్సేషన్ సృష్టించి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయ్. ఇలా ఎలాంటి అంచనా లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చి భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా కేజిఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. అయితే మొదటి సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది అని చెప్పాలి.


 ఇక సీక్వల్ గా వచ్చిన సినిమా కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఒకవైపు హీరో యష్ మరోవైపు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు అని చెప్పాలి. అయితే కేజిఎఫ్ త్రీ కూడా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. సెకండ్ పార్ట్ ఎండింగ్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరిలో కూడా ఈ సినిమాపై మరింత ఆత్రుత పెరిగిపోయింది. అయితే సెకండ్ పార్ట్ లో కన్ఫ్లూజన్ లేకుండా ఎండింగ్ వదిలిపెట్టడం వల్ల అభిమానులకు కూడా ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.


 అయితే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించే  పనిలో బిజీ అయిపోయాడు. దీంతో కేజిఎఫ్ 3 మాటే ఎక్కడ వినిపించడం లేదు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం 2025లో కేజీఎఫ్ తెలుగు సినిమా రిలీజ్ కానుందని హోంబులె ఫిలింస్  ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై అధికారిక ప్రకటన ఏడాది డిసెంబర్ 21న చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక 2024 అక్టోబర్లో షూటింగ్ మొదలవుతుందని.. 2025 వరకు ఇక ఈ సినిమా థియేటర్లలో చూడొచ్చు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: