పాన్ ఇండియా రేంజ్ భారీ సక్సెస్ అందుకున్నాక ప్రతి హీరోకి వచ్చే సమస్య, తరువాత ఎటువంటి ప్రాజెక్ట్ ను ఎంచుకోవాలి అని. బాహుబలి విజయం తరువాత ప్రభాస్ కు వచ్చిన ఇదే సమస్య, మరో స్టార్ హీరోనూ ఇబ్బంది పెడుతోంది. అతడే కే జి ఎఫ్ స్టార్ యష్. కే జి ఎఫ్ చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కన్నడ హీరో, తన చివరి చిత్రం విడుదలయ్యి దాదాపుగా సంవత్సరం కావస్తున్నా, ఇంతవరకు ఇంకో సినిమా మొదలుపెట్టలేదు. కారణం తాను తదుపరి చెయ్యబోయే సినిమా, పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించేలా ఉండాలి. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు యాష్. ఐతే ఇప్పుడు యాష్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అదేంటో ఇప్పుడు చూద్దాం.

గత కొన్నాళ్లుగా రామాయణాన్ని మళ్ళీ చిత్రీకరించాలని ఆలోచనలో ఉంది బాలీవుడ్. ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవ్వడమే కాకుండా, ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఐతే ఈసారి తగు జాగ్రత్తలు తీసుకొని పగడ్బందీగా సినిమాను  ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనికి తగ్గ కాస్ట్ ను కూడా ఫైనల్ చేసారు. ఈ పాన్ ఇండియా  ప్రాజెక్ట్ లో రాముడిగా రన్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో రావణుడిగా యాష్ నటించబోతున్నారు. గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నితీష్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. 2024 జూన్ లో యాష్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ చిత్రం విఫలం అవ్వడానికి ముఖ్య కారణం వీఎఫ్ఎక్స్. అందుకే ఈ చిత్రానికి నితీష్ తివారి ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ టీం ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్....ఇలా అన్ని విభాగాలకు భారతదేశంలో అత్యున్నత  టెక్నిషియన్స్ ను ఈ ప్రాజెక్ట్ కు ఉపయోగించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారు మేకర్స్. మొదటి భాగంలో రావణుడి సన్నివేశాలు తక్కువగా ఉండటంవలను యాష్ కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: