అక్కినేని నాగచైతన్య, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ దూత.. ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సిరీస్ ప్రారంభం కాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ ను 54వ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ వేడుకకు హాజరయ్యి పలు విషయాలను తెలియజేయడం జరిగింది.


వీరందరితో పాటు కంట్రీ డైరెక్టర్, ప్రైమ్ వీడియో సుశాంత్ శ్రీరామ్ తదితరులు సైతం ఇందులో పాల్గొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ఓటీటి లో తన కు సరైన ఫర్ఫెక్ట్ సబ్జెక్టు ఇదే అంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇన్నాళ్లు ఓటీటి లో గొప్ప కంటెంట్లను సైతం చూస్తూ ఉన్నాను డిసెంబర్ ఒకటవ తేదీన తన కంటెంట్ గురించి కూడా మాట్లాడుకోవడం తాను వింటానని కచ్చితంగా ఇది ఒక గొప్ప అనుభూతిని సైతం అందిస్తుంది అంటూ తెలియజేయడం జరిగింది. ఎన్నో గొప్ప కథలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువేస్తున్న ఓటిటి ప్లాట్ఫారం అనేది ప్రతి ఒక్క కళాకారునికి సైతం ఒక చక్కటి అవకాశం ఇలాంటి అవకాశాలను కల్పిస్తున్న వారందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలంటే తెలిపారు నాగచైతన్య.


తెలుగులో నటించాలనే వెబ్ సిరీస్ కి తన 17 ఏళ్ల కల ఎదురుచూపులకు దూత సిరీస్ నిజం చేయబోతుందని పార్వతి తిరువోతు కూడా తెలియజేయడం జరిగింది. ఇక డైరెక్టర్ నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్  ప్రత్యేక పాత్రలు పోషించడం జరిగింది. ప్రస్తుతం సాయి పల్లవి తో నాగచైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మరి నాగచైతన్య వెబ్ సిరీస్ తో సక్సెస్ బాట పడతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: