అక్కినేని నాగార్జున సినీ కెరీర్ గత కొద్ది రోజులుగా ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు.ఈ మధ్యకాలంలో ఈయన నటించిన ది గోస్ట్,బ్రహ్మాస్త్ర వంటి సినిమాలు ఈయనకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.అయితే అప్పట్లో ఓ సినిమా చేసిన తర్వాత నాగార్జున సినీ కెరియర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయిందట. అయితే ఈ సినిమా చేసే కంటే ముందు నాగార్జున సినీ కెరియర్ చాలా బాగుండేదట.కానీ ఎప్పుడైతే ఈ సినిమా చేశారో అప్పటినుండి ఈయన సినీ కెరియర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయినట్టు తెలుస్తుంది. ఇక నాగార్జున చేసిన ఆ సినిమా ఏదో కాదు కేడి. కిరణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున మమతా మోహన్ దాస్ హీరో హీరోయిన్లు గా చేశారు.ఇక ఈ సినిమా చేసే కంటే ముందు చేసిన ప్రతి ఒక్క సినిమా టాక్ తో సంబంధం లేకుండా దర్శకుడితో సంబంధం లేకుండా థియేటర్లలో దద్దరిల్లిపోయేది. కానీ ఎప్పుడైతే కేడి సినిమా చేశారో అప్పటినుండి ఈయన సినీ కెరియర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది అని చెప్పుకోవచ్చు.

అయితే కేడి సినిమాకి దర్శకత్వం బాలేదు అని అప్పట్లో ఒక టాక్ వినిపించింది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా చేసిన కిరణ్ కుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ చేశారట.  అయితే డైరెక్టర్ కిరణ్ కుమార్ లేని చాలా సమయాల్లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేశారట. డైరెక్టర్ లేని సమయంలో చాలా వరకు షూటింగ్ అయిన కానిచ్చేశారని తెలుస్తోంది. ఇక నాగార్జున కేడి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడమే కాదు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా సందీప్ రెడ్డి వంగా కనిపించారు. అలా ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంలో సందీప్ రెడ్డి బాగమయ్యారు. ఇక అప్పటివరకు ఎంతో అద్భుతంగా ఉన్న నాగార్జున సినీ కెరీర్ ఈ ఒక్క సినిమాతో మొత్తం తలకిందులుగా మారిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: