సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు ఇక ఎన్నో కమర్షియల్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం అందరికంటే భిన్నంగా పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా ఇక వారి పాత్రల ద్వారా ప్రేక్షకులను ఎప్పుడు సర్ ప్రైస్ చేస్తూ ఉంటారు. ఇక ఇలా ఎప్పుడూ చాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే హీరోలలో మలయాళ స్టార్ హీరో అయిన పృధ్విరాజ్ సుకుమారన్  కూడా ఒకరు. ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ ద్వారా ఇక తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా మారిపోయాడు.


 సలార్ మూవీలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ వరద పాత్రలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే సలార్ మూవీలో మాత్రమే కాదు అంతకుముందు కూడా పృధ్విరాజ్ సుకుమారన్  కెరియర్ చూసుకున్నా అన్ని చాలెంజింగ్ రోల్స్ ఉంటాయి  ఎక్కువగా ఇలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు పృధ్విరాజ్ సుకుమారన్ నటించిన మరో కొత్త సినిమాలోని పాత్ర అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఆడు జీవితం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు పృధ్విరాజ్ సుకుమారన్. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి.



 అయితే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. కాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్  ఆడు జీవితం సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఏకంగా నజీబ్ అనే ఒక బానిస పాత్ర పోషించినట్లు తెలిపాడు పృధ్విరాజ్ సుకుమారన్. ఇందుకోసం ఏకంగా 31 కేజీల బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చాడు. జిమ్ ట్రైనర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఇది సాధ్యమైంది అంటూ తెలిపాడు. జోర్డాన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ విధించడంతో ఎంతో కష్టపడ్డామ్ అంటూ తెలిపాడు. కాగా ఈ మూవీ గోట్ లైఫ్ పేరుతో ఇంగ్లీషులో కూడా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: