'గీత గోవిందం' సినిమా తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ-పరశురాం ఫ్యామిలీ స్టార్ తో కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు.టీజర్ నుంచి పాటల దాకా ప్రతి ఒక్క విషయంలో ఈ సినిమాని ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఉదయం ట్రైలర్ విడుదల అయ్యింది.ట్రైలర్ తో ఇది పక్కా ఫ్యామిలీ సినిమా అని తేలిపోయింది. డైరెక్టర్ మరోసారి విజయ్ లేడీ ఫాలోయింగ్ ని దృష్టి లో పెట్టుకుని రాసుకున్న కథలాగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. హీరోయిన్ హీరో వెంట పడటం... అటుపై హీరో కాదనడం..తప్పు తెలుసుకున్న హీరో విదేశాలు వెళ్లి ఒప్పించడాన్ని పరశురాం తనదైన శైలిలో కామెడీ టచప్ తో బాగానే ఆవిష్కరించాడు.అలాగే విజయ్ లో యాక్షన్ స్టార్ ని కూడా డైరెక్టర్ బాగానే హైలైట్ చేసాడు. నేనైతే మీకు ఫుల్లుగా పడిపోయా అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పిన రొమాంటిక్ డైలాగ్ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. బుర్ర బద్దలైపోతుద్ది కొడకా...భయపడాలిరా ఇంకోసారి ఎవరైనా చులకనగా మాట్లాడాలంటే? అంటూ విజయ్ విలన్స్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్స్ కూడా ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.


డైరెక్టర్ హీరో లో మెంటల్ లెవల్ ని టచ్ చేసినట్లు కనిస్తుంది. కోపం ఎగిరి పోతుందంటే నన్ను కొట్టవే బాబు! అంటూ ట్రైలర్ చివర్లో విజయ్ దేవరకొండ అనగానే మృణాల్ అతడి చెంపపై లాగి పెట్టి కొట్టడం కూడా ఆకట్టుకుంటోంది.మిడిల్ క్లాస్ కుర్రాడిలాగా స్టైలిష్ గా కనిపిస్తూనే కామెడీతోనే నవ్వించాడు. హీరో-హీరోయిన్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్గా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ గా మారింది. అయితే ట్రైలర్ కి కూడా ట్రోల్స్ తప్పట్లేదు. ఇంకొక మైనస్ ని ఎత్తి చూపిస్తున్నారు నెటిజన్స్. అదే విజయ్ దేవరకొండ స్లాంగ్. విజయ్ తెలంగాణ అబ్బాయి కావడంతో స్పష్టమైన ఆంధ్ర తెలుగు మాట్లాడలేకపోతున్నాడు. అదొక్కటి చూసుకుంటే విజయ్ కి తిరుగుండదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో తెలుగు..తమిళ..హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: