తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ తాజాగా రత్నం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియ భవాని శంకర్ ఈ మూవీ.లో విశాల్ కి జోడి గా నటించింది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

ఇక విశాల్ మరియు హరి కి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉండడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రత్నం మూవీ కి 6 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 66 లక్షల కలెక్షన్ లు దక్కగా , మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిపి 90 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.56 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మరో 2.9 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: