
అనిల్ రావిపూడితో చిరంజీవి చేయబోయే సినిమా వచ్చే సంక్రాంతికి రానుంది .. ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఈమధ్య వైజాగ్లో మొదలుపెట్టారు దర్శకుడు అనిల్ రావిపూడి .. సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. మూడు నెలల్లో టాకీ పూర్తి చేసి ఆరు నెలల్లో సినిమా విడుదల చేయాలనేది డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్లాన్ .. చిరు కూడా దీనికే ఓకే అయ్యారు . అయితే అంతా బాగానే ఉంది కానీ చిరంజీవిని టార్గెట్ చేయడానికి మరో ఇద్దరు స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి రాబోతున్నారు. గతంలో వచ్చిన సంక్రాంతికి చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యా అంటూ పండక్కి వచ్చిన మాస్ మహారాజా .. ఇప్పుడు 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీకి సై అంటున్నాడు ..
కిషోర్ తిరుమల తో చేయబోయే సినిమాను సంక్రాంతికి టార్గెట్గా పెట్టుకున్నాడు .. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ అంటేటైనర్ కూడా ఇదే .. పైగా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే కథ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమాని కూడా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు .. ఎన్టీఆర్ వస్తే వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు .. పైగా ప్రశాంత్ నీల్ కాబట్టి మాస్ రీచ్ మరో లెవెల్ లో ఉంటుంది .. అన్ని కుదిరి 2026 సంక్రాంతికి చిరంజీవి , రవితేజ , ఎన్టీఆర్ సినిమాలు వస్తే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు రావడం మాత్రం ఖాయం.