అల్లు అర్జున్ హీరోగా రూపొందిన చాలా సినిమాలకు అద్భుతమైన టిఆర్పి రేటింగ్ లు బుల్లి తెరపై వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ ఆఖరుగా నటించిన ఐదు మూవీలకు మొదటి సారి బుల్లి తెరపై వచ్చిన టిఆర్పి రేటింగ్ వివరాలను తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొంత కాలం క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తాజాగా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 12.61 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది.

పుష్ప పార్ట్ 1 : అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 22.54 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరో గా నటించిన ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 29.4 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది.

నా పేరు సూర్య : అల్లు అర్జున్ హీరో గా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై 12 టిఆర్పి రేటింగ్ వచ్చింది.

దువ్వాడ జగన్నాథం : అల్లు అర్జున్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదటి సారి 21.7 టిఆర్పి రేటింగ్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa