టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లలో తన గ్లామర్ తో నటనతో అందరిని మైమరిపించగలిగిన హీరోయిన్గా పేరు పొందుతుంది హెబ్బా పటేల్. ఈ మధ్య తనకి ఎంచుకున్న పాత్రలు అన్నీ కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే గతంలో హెబ్బా పటేల్ ఎక్కువగా గ్లామర్ పాత్రలోనే నటిస్తూ ఉండేది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించింది. చివరికి స్పెషల్ సాంగ్లలో కూడా కనిపించింది. కుమారి 21ఎఫ్ సినిమా తో మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన హెబ్బా పటేల్ తన మొదటి సినిమాతోనే పేరు బాగా సంపాదించింది.


ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్న హెబ్బా పటేల్ సక్సెస్ మాత్రం అందుకోలేదు. సోషల్ మీడియాలో నిరంతర యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను మాత్రం తగ్గకుండా చేసుకున్నది. సోషల్ మీడియాలో ఒరేంజ్ లో అందాలను ఆరబోత చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. హెబ్బా పటేల్ గ్లామర్ రోల్స్ లో కూడా నటించడంలో ముందుంటుంది. అయితే ఇలా గ్లామర్ పాత్రలలో నటించడానికి ముఖ్య కారణం తెలియజేస్తూ అప్పట్లో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని అందుకే తన దగ్గరకు వచ్చిన ఎలాంటి పాత్రనైనా సరే తాను చేయడానికి ఒప్పుకున్నానని కానీ తనకు ఇలాంటి పాత్రలు అలాంటి పాత్రలు చేయాలని గైడ్ చేసేవాళ్లే లేరని తెలిపింది.


అలా దాంతో సినిమాలను ఒక జాబు లాగా మాత్రమే చేశానని అందుకోసం డబ్బులు తీసుకున్నానని ఇప్పుడు తాను బాగా సెటిల్ అయ్యాను కాబట్టి తన నటనకు ఉండే పాత్రలలో మాత్రమే నటిస్తున్నాను అంటూ తెలియజేసింది హెబ్బా పటేల్. మొత్తానికి హెబ్బా  పటేల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓదెల 2 చిత్రంలో కూడా నటించిన హెబ్బా పటేల్ తన పాత్రకి తగ్గ న్యాయం చేసిందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: