సోషల్ మీడియాలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించే సినిమా గురించి ఎలాంటి రకాల వార్తల వినిపిస్తూ ఉంటాయో మనం చూస్తూనే వస్తున్నాం. ఈ సినిమా పై మామూలు ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవడం లేదు జనాలు..ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ ఇప్పటి నుంచే సినిమా కి ఆస్కార్ అవార్డ్ కన్ ఫామ్ అంటున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా షూట్ కి బ్రేక్ చెప్పి మరి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు.


రాజమౌళి సాధారణంగా ఇలాంటివి ఒప్పుకోరు . కానీ మహేష్ బాబు కోసం అన్ని యాక్సెప్ట్ చేశారు . మహేష్ బాబు కోసం తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్  కొంచెం కొంచెం గా మార్చేసుకుంటున్నాడు రాజమౌళి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు .ఇలాంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ మరింత ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి - మహేష్ బాబుతో మరొక క్రేజీ పని చేయించబోతున్నాడు అన్న టాక్ బాగా వైరల్ గా మారింది. సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఎక్కువగా రిస్కులు తీసుకోరు . అది ఎందుకో కూడా అందరికి తెలుసు.



రిస్కీ స్టంట్స్ ఏమున్నా సరే డూప్స్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా అడ్వెంచర్స్ సీన్స్ అయితే అసలు టచ్ కూడా చేయరు.  ఇప్పటివరకు మహేష్ బాబు తను నటించిన సినిమాలలో డూప్ లేకుండా అడ్వెంచర్స్ సీన్స్ నటించిన సందర్భాలే లేవు . కానీ ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి మహేష్ బాబుతో డూప్ లేకుండా ఈ సినిమాను చేయిస్తున్నారట.  బిగ్ అడ్వెంచర్స్ సీన్స్ లో కూడా డూప్ లేకుండా మహేష్ బాబుని స్వయంగా స్టంట్ చేసే విధంగా రాజమౌళి ప్లాన్ చేశారట.  మొదట నో చెప్పిన మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి ఇన్స్పిరేషన్ తో ఎస్ చెప్పారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ  న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు నిజంగా రిస్క్ చేశాడని అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: