పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయొ తెలియని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పొలిటికల్ పరంగా బిజీగా అవ్వడం చేత పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాల రిలీజ్ పరిస్థితి అయోమయంలో పడేలా చేసింది. అందులో ఒకటి హరిహర వీరమల్లు మరొకటి ఓజి. ఈ సినిమాలు రిలీజ్ కావడం కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా షూటింగ్ ఉండగానే ఓజి, వీరమల్లు సినిమా బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే జరిగనటువంటి బిజినెస్ ఓజి చిత్రానికి జరుగుతున్నట్లు సమాచారం.

ఓజీ కంటే ముందు రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా కంటే ఎక్కువగా బిజినెస్ జరుగుతున్నదట. ఇప్పటికే ఓజి చిత్రం 200 కోట్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు జరిగినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బాలీవుడ్ నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ డేట్ అడ్జస్ట్ చేస్తే సినిమా షూటింగ్ అని పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.


కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన డేట్లు కేటాయించడానికి ఇటీవలే నిర్మాతలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని సినిమా విడుదల తేదీకి సహాయపడతారేమో చూడాలి. అలాగే ఓజి సినిమా ఓటీటి,శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకొని బిజినెస్ భారీగానే జరిగినట్లుగా టాక్ వినిపిస్తున్నది. హరిహర వీరమల్లు సినిమాకి కూడా బిజినెస్ బాగానే జరిగినట్లుగా సమాచారం. ఏపీలో ఒక్కటి 100 కోట్ల వరకు అన్ని ఏరియాలలో అమ్ముడుపోయాయని వినిపిస్తోంది. మొత్తానికి అటు హరిహర వీరమల్లు, ఓజి సినిమా రెండు కూడా బిజినెస్ పరంగా బాగానే ఉన్నాయట మరి కలెక్షన్స్ పరిస్థితి ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: