అనుష్క - ప్రభాస్ లవర్స్ అంటారు కొంతమంది.  మరి కొంతమంది ఫ్రెండ్స్ అంటారు. మరి కొంతమంది కాబోయే భార్య భర్తలు అంటారు . కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ మేము ఫ్రెండ్స్ గానే ఉంటాం ఫ్రెండ్స్ గానే జీవిస్తాం అని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు . సోషల్ మీడియాలో వీళ్లిద్దరికి సంబంధించిన వార్తలు రకరకాలుగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూనే ఉంటాయి . కానీ వీళ్ళు మాత్రం తమ మధ్య ఫ్రెండ్షిప్ ని ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ రాకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలోనే అనుష్క - ప్రభాస్పెళ్లి అంటూ ఎన్ని వార్తలు వినిపించాయో అందరికీ తెలిసిందే .


అయితే అదంతా ఫేక్ అంటూ అనుష్కకి సంబంధించిన వ్యక్తులు ఇటు ప్రభాస్ కి సంబంధించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంటారు.  కాగా ఓ విషయంలో ప్రభాస్ చెప్పిన విషయాన్ని వినకుండా అనుష్క పెద్ద తప్పు చేసింది అన్న విషయాన్ని ఫాన్స్ మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.  అది మరేంటో కాదు "సైజ్ జీరో" మూవీ . సైజ్ జీరో మూవీ కోసం ఆమె బరువు పెరగాలి అంటూ డిసైడ్ అయింది . అయితే చాలామంది ఈ రిస్కీ పనులు చేయొద్దు అంటూ ఆమెకు సజెస్ట్ చేశారు . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ బొద్దుగా మారిపోతే అవకాశాలు తగ్గిపోతాయి అన్న విషయం అందరికీ తెలుసు . అదే విషయాన్ని స్వీటీకి చాలా మంది దగ్గర వ్యక్తులు చెప్పారు .



మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ ప్రాజెక్టు వద్దు వద్దు అని  నెత్తి నోరు మూసుకున్నారు.  కానీ అనుష్క వినలేదు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా డిఫరెంట్గా ఆలోచించే అనుష్క సైజ్ జీరో కోసం బరువు పెరిగింది . ఈ సినిమా హిట్ కాకపోగా ఆమెకు ఫుల్ తలనొప్పులు క్రియేట్ చేసింది . ఈ సినిమా కోసం పెరిగిన బరువును తగ్గడానికి చాలా చాలా టైం తీసుకుంది . ఇప్పటికి అనుష్క ఆ బరువు తగ్గలేకపోతుంది . దీంతో ప్రభాస్ చెప్పిన మాట వినుంటే బాగుండేదిగా అంటూ రెబెల్ ఫ్యాన్స్ కూడా ఫైర్  అయ్యారు. అనుష్కకి ఇప్పటికి మంచి ఆఫర్స్ రాకపోవడానికి కారణం ఆమె బరువే అన్న సంగతి అందరూ మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: